ADD

Wednesday 14 February 2018

నల్గొండ ఎంపీ గా కవిత???:నల్గొండ పై కేసిఆర్ స్కెచ్

   నల్గొండ ఎంపీ గా కవిత???:నల్గొండ పై కేసిఆర్ స్కెచ్
ఎన్నికల వ్యూహకర్తగా తలపండిన కేసీఆర్ 2019 ఎన్నికలకు మొదటి వ్యూహాన్ని సిద్ధం చేసాడు.ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఆ పార్టీ ని దెబ్బ కొట్టే దిశగా వ్యూహాలకు పడునుపెడుతిన్నాడు.ఇందులో భాగంగా ప్రస్తుతం నిజామాబాద్ ఎంపి గా ఉన్న కవిత ని రాబోవు ఎన్నికల్లో నల్గొండ పార్లిమెంట్ బరిలో నిలిపి కాంగ్రెస్ పార్టీ ని చిత్తు చేయడమే కాకుండా ఈ నియోజకవర్గం లోని 7 శాసన సభ నియోజకవర్గాల్లో టిఆరెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కవితను నల్గొండ బరిలో నిలిపితే నియోజకవర్గ ప్రజల చూపు శాసనసభ నియోజకవర్గల పై పడితుందని ఇందులో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన భూపాల్ రెడ్డి ని నల్గొండ బరిలో గెలిపించుకుని,సూర్యాపేట,కోదాడ,మిర్యాలగూడ తో పాటు ఉత్తమ కుమార్,జానా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న 2 నియోజకవర్గాలను టిఆరెస్ ఖాతాలో వేయాలని పట్టుదలతో ఈ వ్యూహాన్ని సిద్ధం చేయడంతో పాటు కవితను జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం లో నిలిపి ఇక్కడా టిఆరెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు.

Sunday 4 September 2016

మరో తెలంగాణోడి గవర్నర్ గిరి... ! త్వరలో తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి ???

మరో తెలంగాణోడి గవర్నర్ గిరి... !

త్వరలో తమిళనాడు గవర్నర్ గా  మోత్కుపల్లి ???


మోత్కుపల్లి ఎదురుచూపులు ఫలించే రోజులు దగ్గరపడ్డాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మోత్కుపల్లికి గవర్నర్ గిరి త్వరలోనే తమిళనాడు గవర్నర్ గా నియమితులు కాబోతున్నారు. ఈ మధ్యే తమిళనాడు గవర్నర్ గా రోశయ్య  పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు కి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. త్వరలోనే తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి నరసింహులు గారిని నియమించనున్నారని టిడిపి వర్గాల సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మోడీ తిరిగి రాగానే ఆదేశాలు వస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే విద్యాసాగర్ రావు గవర్నర్ గా విధుల్లో ఉండగా మోత్కుపల్లి గవర్నర్ గిరి చేపడితే తెలంగాణ నుండి రెండవ వ్యక్తిగా నిలుస్తారు. 

తెరపైకి సిరిసిల్ల ,జనగాం జిల్లాలు ...!

తెరపైకి సిరిసిల్ల ,జనగాం జిల్లాలు ...!

తెలంగాణాలో 27జిల్లాలతో ముసాయిదా నోటిఫికేషన్ వెలువరించిన అనంతరం ఎగసిపడిన ప్రజా ఉద్యమాలతో చివరి నోటిఫికేషన్ లో మరికొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. 27జిల్లాల్లో సిరిసిల్లా ,జనగాం చేర్చాలని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు మొదలవడంతో కెసిఆర్ మరోమారు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఇందులో కెసిఆర్ తనయుడు కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకోవడం,కెటిఆర్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కెసిఆర్ పెద్దపెల్లి,హన్మకొండ జిల్లాల స్థానంలో సిరిసిల్ల ,జనగాం లను చేర్చనున్నట్లు తెలుస్తుంది.

Saturday 3 September 2016

కెసిఆర్ "ఆపరేషన్ కాంగ్రెస్ వన్స్ మోర్" కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్???

కెసిఆర్ "ఆపరేషన్ కాంగ్రెస్ వన్స్ మోర్" 

కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్???

గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆపరేషన్ ఆకర్ష్ కు  తెలంగాణాలో మళ్లీ తెరలేవనుంది. ఇప్పటికే ప్రతిపక్షాల ఉనికిని కోల్పోయేలా చేసిన కెసిఆర్ ఇక కూకటివేళ్లతో సహా పెకిలిస్తారేమో??? మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని కారెక్కించే పని చాపకింది నీరులా సాగిపోతున్నట్టు సమాచారం. కృష్ణా పుష్కరాల సమయంలోనే సంపత్ కుమార్ కెసిఆర్ తో భేటీ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సంపత్ పార్టీ వీడటం ఆగిపోయింది.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత సంపత్ కాంగ్రెస్ వీడి కారెక్కనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సంపత్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. చర్చలు కొలిక్కివస్తే సంపత్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కే అవకాశం ఉండనుంది.  

Friday 2 September 2016

అన్నదాతను ఆదుకుందామిలా.....! తెలంగాణ నూతన వ్యవసాయవిదానం ఉండాలిలా ....

అన్నదాతను ఆదుకుందామిలా.....!

   తెలంగాణ నూతన వ్యవసాయవిదానం ఉండాలిలా .... 

దేశంలోనే వేగంగా అభివృద్ధి లో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ,లక్ష కోట్ల ప్రాజెక్టులకు సైతం నెల రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన నూతన ఏకగవాక్ష పారిశ్రామిక విదానం రూపొందించుకున్నాం,తెలంగాణాని ప్రపంచ విత్తన బండాగారం లా తీర్చిదిద్దాలని,తెలంగాణను కోటి ఎకరాల మాగాణంలా మార్చాలనే ఆశయంతో ముందుకు వెళుతున్నాం కానీ అన్నదాత ఇంకా నిరాశ కోరల్లోనే ఉన్నాడు... 
--తెలంగాణ పారిశ్రామిక విధానంతో క్షణాల్లో అనుమతులు 
--ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ కార్పోరేషన్ లు ఏర్పాటు చేసి,వేల కోట్ల నిదులు కేటాయిస్తున్నాం 
--ముఖ్యమంత్రి సహాయనిధి పేరిట ఎన్నోకోట్లతో  ఎంతోమంది  నిరుపేదల ప్రాణాలు నిలబెడుతున్నాం 
కానీ 
-అన్నదాతల రుణమాపీకి విడతల వారీగా ఇస్తూ సాగదీస్తూనే  ఉన్నాం 
-రైతుల ఇన్ ఫుట్ సబ్సిడీలకు ఎదురుచూపులే దిక్కు 
-అతివృష్టి ,అనావృష్టి వంటి కారణాలవల్ల పంటనష్టం వాటిల్లిన ప్రతిసారీ నష్టపరిహారం కోసం ఎదురుచూపులే 
-దేశంలో ఎంతోమంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నా వారికి వ్యవసాయం కనుచూపుమేరలో కూడా ఉపాధిగా అనిపించక ఒకతరాన్ని సేద్యానికి దూరం చేశాం 
   ప్రస్తుతం ఉన్న ఈ  పరిస్థితుల్లో మార్పు రావటానికి అన్నదాత ను ఆదుకోవడానికి తెలంగాణ నూతన వ్యవసాయ విధానం అత్యావశ్యకం 

తెలంగాణ నూతన వ్యవసాయ విధానం :

--రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే  అవసరం లేకుండా తక్షణం రుణాలు అందేలా ఏకగవాక్ష విదానం 
-- రైతు యూనిట్ గా పంటల భీమా భీమా 
--తెలంగాణ రైతు కార్పొరేషన్ ,రైతులకు పంట నష్టపరిహారం,ఇన్ ఫుట్ సబ్సిడీ త్వరగా త్వరగా అందేలా రైతు సహాయ నిధి ఏర్పాటు 
--రైతులకు సేంద్రీయ సేద్యం పై అవగాహన కల్పించేలా వ్యవస్థ 
--దళారుల వ్యవస్థ రూపుమాపి రైతుల పంటలను మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేపట్టడం 
--రైతులకు తమ పంటలను నిలువ చేసుకునేందుకు అవసరమైన గోదాములను నిర్మించడం 
--వ్యవసాయం ,అనుబంధ రంగాలను ఒకే వ్యవస్థ కిందకు తెచ్చి రైతులు వాణిజ్య పంటల వైపు మారలేలా అవగాహన 
--వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంలా తీర్చిదిద్దడం 
--విత్తనోత్పత్తి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం 
--నిరుద్యోగ యువత వ్యవసాయం పై దృష్టి సారించేలా ప్రోత్సాహకాలు 

తెలంగాణ ప్రాజెక్టులకు నాబార్డ్ నిధులు

తెలంగాణ ప్రాజెక్టులకు నాబార్డ్ నిధులు 

   నాబార్డ్ తో ఒప్పందానికి ఉమాభారతి లేఖ 

కేంద్ర ప్రభుత్వం దేశంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రధానమంత్రి  కృషి సించాయి యోజన పథకం కింద తెలంగాణలోని దేవాదుల ,కొమురం భీం,గొల్లవాగు,,మత్తడివాగు,భీమా ఎత్తిపోతల సహా 11పథకాలకు నాబార్డు కింద నిధులు ఇవ్వడానికి అంగీకారం తెలిపిన కేంద్రం ఇందుకు సంబంధించి ఒప్పందం చేసుకోవడానికి కేంద్రమంత్రి ఉమాభారతి తెలంగాణ నీటిపారుదల శాఖ మాత్యులు హరీష్ రావు కి లేఖ రాసింది. తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిన నేపద్యంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతి,భూసేకరణ,నిర్వాసితులకు చెల్లింపులు వంటి సమస్యలపై దృష్టి సారించింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద తెలంగాణ లోని 11 ప్రాజెక్టుల పూర్తికి 5325 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనావేసింది. 

Thursday 1 September 2016

చంద్రబాబు తొండాట....!

చంద్రబాబు తొండాట....!

ఓటుకు నోటు దర్యాప్తు ఆపాలని హైకోర్టులో పిటీషన్ 

మచ్చ లేని చంద్రుడిని అంటూ ఎల్లప్పుడూ ఊదరగొట్టే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా తిమ్మిని బమ్మి చేయడమే నా ధ్యేయం అన్న చందంగా మరోమారు తొండాటకు తెరలేపారు. నిన్న ఎసిబి కోర్టు ఓటుకు నోటు కేసు దర్యాప్తు నివేదికను ఈ నెల 29లోపు సమర్పించాలని ఆదేశించగా  ఆ ఆదేశాలను ఆపేయాలంటూ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన తరుపు లాయరుచే హైకోర్టులో పిటీషన్ వేయగా  ఈ  పిటీషన్ పై రేపు వాదనలు విననుంది హైకోర్టు ధర్మాషణం.